Sunday, May 19, 2024

Election | జ‌ర్న‌లిస్టులూ పోస్ట‌ల్ బ్యాలెట్స్‌కు దరఖాస్తు చేసుకోండి…

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 12లోగా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కవరేజీ కోసం ఎన్నికల అధికార లెటర్లకు దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు ఫారం 12ని డౌన్‌లోడ్ చేసుకుని.. ఫారాన్ని నింపిన తర్వాత ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సచివాలయం మీడియా పాయింట్‌ పక్కనే ఉన్న పబ్లిసిటీ సెల్‌ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

ద‌ర‌ఖాస్తుతో పాటు ఓట‌ర్ ఐడీ కార్డు జిరాక్స్, అక్రిడేష‌న్ కార్డు జిరాక్స్ త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాలి. అంతేకాకుండా అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ఓట‌ర్ పోర్ట‌ల్ ద్వారా త‌మ ఎపిక్ నంబ‌ర్‌ను స‌రిచూసుకుని జ‌త‌ప‌ర‌చాల‌ని అధికారులు సూచించారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు సమర్పించిన త‌ర్వాత‌.. ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా విత్ డ్రా చేసుకునేందుకు అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement