Saturday, April 27, 2024

London : అదృశ్య‌మై… థేమ్స నదిలో శవమై తేలిన భార‌తవిద్యార్థి

గత నెలలో తప్పిపోయిన భారతీయ విద్యార్ధి శవమై కనిపించాడు. వాకింగ్ కోసం బయటకు వెళ్లిన మిత్ కుమార్ డెడ్ బాడీ థేమ్స్ నదిలో కనిపించింది.

భారత్‌లో ఓ రైతు కుటుంబానికి చెందిన మిత్ కుమార్ ఉన్నత చదువుల కోసం సెప్టెంబర్‌లో యూకే వెళ్లాడు. నవంబర్ 17 నుండి కనిపించకుండా పోయాడు. దీంతో అతని బంధువులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. నవంబర్ 21 న తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మరణానికి గల కారణాలపై విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement