Friday, May 3, 2024

సీనియర్‌ సిటిజన్స్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ గుడ్‌ న్యూస్‌..

న్యూఢిల్లి : ప్రైవేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీం వడ్డీ రేట్లను పెంచింది. సీనియర్‌ సిటిజన్ల కోసం ఈ పథకం తీసుకొచ్చారు. సీనియర్‌ సిటిజన్‌ల కోసం ప్రారంభించిన ఈ ప్రత్యేక టర్మ్‌ డిపాజిట్‌ పథకం రేటు పెంచారు. కొత్త రేట్లు మే 21నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ప్రత్యేక ఎఫ్‌డీ పథకంలో సీనియర్‌ సిటిజన్‌లకు అదనపు వడ్డీ ఇస్తారు. ఎఫ్‌డీలో కూడా సీనియర్‌ సిటిజన్స్‌కు సాధారణ డిపాజిటర్‌ కంటే ఎక్కువ వడ్డీ పొందుతారు.

కానీ గోల్డ్‌న్‌ ఇయర్‌ ఎఫ్‌డీ పథకం సీనియర్‌ సిటిజన్‌ ఎఫ్‌డీ పథకం కంటే ఎక్కువ వడ్డీ పొందుతారు. ఇది కరోనా సమయంలో ప్రారంభించారు. మే 20, 2020న ప్రారంభమైన ఈ పథకం.. రూ.2కోట్ల కంటే తక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేసిన వారికి వర్తిస్తుంది. గోల్డెన్‌ ఇయర్‌ ఎఫ్‌డీ స్కీంలో.. సీనియర్‌ సిటిజన్లకు 6.35 శాతం వడ్డీ ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని 6.50 శాతానికి పెంచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement