Friday, May 3, 2024

అంగన్వాడీ ఇష్యూను నేను టేకప్ చేస్తా : చంద్రబాబు

కుప్పం, (ప్రభ న్యూస్) : కుప్పం నియోజకవర్గంలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్ లు, ఆయాలపై పని ఒత్తిడి, అధికారులు వేధింపులు అధికంగా ఉన్నాయని రాష్ట్ర ప్రతిపక్ష నేత, కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు వద్ద అంగన్వాడీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మాపై దౌర్జన్యాలు చేస్తున్నారని, ఇష్టానుసారంగా నియమ నిబంధ‌నలు మారుస్తూ మాకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు చంద్రబాబుకు మొర పెట్టుకొన్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ రాష్టంలో వైకాపా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహ‌రిస్తుంద‌న్నారు. అంగన్వాడీ ఇష్యూ ను నేను ప్రత్యేకంగా టేకప్ చేస్తానని హామీ ఇచ్చారు. వెంటనే అంగన్వాడీ సిబ్బంది చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement