Monday, May 6, 2024

Human Trafficking Case – అమెరికాలో ఎపి ప‌రువు తీసిన జ‌గ‌న్ పిల్ల సైకోలు … నారా లోకేష్

అమెరికాలో ఒక యువ‌కుడిని గ‌త కొన్ని నెల‌లుగా హింసిస్తున్న ముగురు తెలుగు యువ‌కుల ఆరెస్ట్ పై టిడిపి జాతీయ కార్య‌దర్శి నారా లోకేష్ స్పందిస్తూ జ‌గ‌న్ సైకో బ్యాచ్ అక్క‌డ కూడా ఎపి ప‌రువు బ‌జారున ప‌డేశారంటూ వాపోయారు.. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేస్తూ,
“అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ దొరికిపోయిన జగన్ రెడ్డి ముఖ్య అనుచరుడు సత్తారు వెంకటేష్ రెడ్డి. ఇతని బ్యాక్ గ్రౌండ్ చూసి, వైకాపా స్టేట్ కో-ఆర్డినేటర్ లాంటి పెద్ద పదవి ఇచ్చాడంటే, జగన్ రెడ్డి ఎలాంటి వాడో అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో ఉండే 20 ఏళ్ల కుర్రాడికి బంగారు భవిష్యత్తు ఆశ చూపించి అమెరికా రప్పించి, అక్కడ కూడా తమ అధినేత జగన్ రెడ్డి నేర్పించిన పాలెగాళ్ళ సంస్కృతి చూపించాడు ఈ సత్తారు వెంకటేష్ రెడ్డి. ఆ కుర్రాడిని తన ఇంట్లో బంధించి, కొట్టి, హింసించి పైశాచిక ఆనందం పొందాడు. పాపం పండి దొరికిపోయాడు. ఈ వైకాపా నేత నిర్వాకంతో, అమెరికాలో కూడా మన ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది. అమెరికాలో కాబ‌ట్టి, ఈ సైకోలకి శిక్ష పడింది. అదే ఇక్కడైతే, సిఐడి స్టోరీలు, సాక్షి కహానీలు, పేటీయం బ్యాచ్ కవరింగ్ లతో, విషయం పక్క దారి పట్టించే వారు. జగన్ రెడ్డి ఇలాంటి సైకోలని పెంచి పోషించి, వాళ్లకి పదవులు ఇచ్చి, నేరాలు-ఘోరాలు చేయిస్తున్నాడు’ అని పేర్కొన్నారు నారా లోకేష్ ..

తిరుప‌తి ల‌డ్డూ నాణ్య‌త‌పై లోకేష్ అస‌హ‌నం..

తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదం నాణ్య‌త‌పై భ‌క్తుల నుంచి అనేక ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని, వాటిని తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప‌రిష్క‌రిస్తామ‌ని లోకేష్ ఒక నెటిజ‌న్ చేసిన ట్విట్ కు స‌మాధానం చెప్పారు.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ , మే నెల‌లో తాము అధికారం చేప‌డ‌తామ‌ని, తిరుప‌తి ల‌డ్డూ విష‌యంలో ఎటువంటి రాజీప‌డ‌కుండా నాణ్య‌మైన ప్ర‌సాదాన్ని భ‌క్తులకు అంద‌జేస్తామ‌ని తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement