Friday, May 3, 2024

‘ఛస్తే చావు’ అంటూ హెల్ప్ లైన్ సిబ్బంది సమాధానం

ఉత్తరప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నోకు చెందిన మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత కుమారుడు సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఈనెల 10న తన భార్యతో పాటు కరోనా టెస్టు చేయించుకున్నాడు. ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో సంతోష్ కుమార్… హెల్ప్ లైన్‌కు ఫోన్‌చేసి కరోనా సోకిన వారికి ప్రభుత్వం ఇచ్చే మెడిసిన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేయగా.. సిబ్బంది ఇచ్చిన సమాధానం షాక్‌కు గురించేసింది.

సంతోష్ కుమార్ ఫోన్ చేసి మెడిసిన్స్ వివరాలను అడగ్గా.. హెల్ప్ లైన్ సిబ్బంది ఐసోలేషన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. దీంతో సంతోష్ తనకు ఆ యాప్ గురించి తెలియదని చెప్పాడు. వెంటనే సిబ్బంది ‘ఏమీ తెలియదా? అయితే చస్తే చావు.. మాకేంటి? మాకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు’ అంటూ నిర్లక్షపు సమాధానం చెప్పేసరికి సంతోష్ కుమార్ షాక్ అయ్యాడు. దీంతో ఆవేదనతో సంతోష్ కుమార్ వెంటనే యూపీ సీఎం యోగికి, జిల్లా అధికారులకు లేఖ రాశాడు. కాగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెల్ప్ లైన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరాడు. ఇటువంటి సమయంలో కనీసం మర్యాద కూడా లేకుండా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement