Thursday, April 25, 2024

భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం… ఎక్క‌డంటే…

మ‌ణిపూర్ లో భారీగా డ్ర‌గ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 500 కోట్ల విలువైన మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప‌ట్టుబ‌డిన డ్ర‌గ్స్‌లో 54 కేజీల బ్రౌన్ షుగ‌ర్‌, 154 కేజీల ఐస్ మెత్‌లు ఉన్నాయి. మోరే ప‌ట్ట‌ణంలో అస్సాం రైఫిల్స్ ద‌ళాలు ఆ డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. మ‌య‌న్మార్‌కు చెందిన మ‌హిళ ఇంట్లో ఆ డ్ర‌గ్స్‌ను ప‌ట్టుకున్నారు. ఆ మ‌హిళ ఓ చైనీయుడిని పెళ్లి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement