Saturday, July 27, 2024

Hamas: హ‌మాస్ గ్ర‌నేడ్ దాడి…21 మంది ఇజ్రాయేల్ సైనికుల మృతి…

హమాస్‌తో జరుగుతోన్న పోరులో తాజాగా ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్‌ మిలిటెంట్లు ఆర్‌పీజీ లాంచర్‌ను ప్రయోగించడంతో 21 మంది సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. సెంట్రల్ గాజాలో రెండు భవనాలను కూల్చేందుకు సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుతుండగా సమీపంలోని ట్యాంక్‌పైకి హమాస్‌ గ్రనేడ్‌ను ప్రయోగించింది.

దాని ధాటికి మందు గుండు పేలిపోయింది. రెండు భ‌వ‌నాలు కుప్ప‌కూలి శిధిలాలు సైనికుల‌పై ప‌డ్డాయి. దీంతో వాటికింద ప‌డి 21 మంది సైనికులు మ‌ర‌ణించారు. మ‌రో 26 మంది గాయ‌ప‌డ్డారు. యుద్దం మొద‌లైన త‌ర్వాత ఒకే రోజు ఇజ్రాయేల్ ఇంత‌మంది సైనికుల‌ను పోగొట్టుకోవ‌డం ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement