Monday, March 25, 2024

Green India Challenge : మొక్కలు నాటిన నిహారికా కొణిదెల..

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో తాజాగా ప్రముఖ నటుడు నాగబాబు కూతురు నిహారికా కొణిదెల మొక్క‌లు నాటారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ప్రతిఒక్కరూ సందర్భమేదైనా మొక్కలు నాటుతూ హరిత సంకల్పంలో భాగమవుతున్నారు. అనంతరం నిహారికా కొణిదెల మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని చెప్పారు. తన తండ్రి నాగబాబు ఎప్పుడు ప్రకృతిని ప్రేమించాలని, మొక్కలు పెంచాలని చెబుతూ ఉంటారని వెల్లడించారు. ఈ ప్రపంచంలో అందరిని కాపాడే మొదటి దేవుడు ప్రకృతి అని.. అలాంటి ప్రకృతిని రక్షించుకునే బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ నిరంతరం కొనసాగడం చూస్తూ ఉన్నానని, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ వారితో మొక్కలు నాటించడం మంచి చాలా బాగుందన్నారు. ప్రతీ ఒక్కరు ఈ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement