Friday, May 3, 2024

వైసీపీ నేతలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నేతలు చంద్రబాబు నివాసాన్ని ముట్టడించడం తెలిసిందే. ఎమ్మెల్యే జోగి రమేష్ అనుచరులు చంద్రబాబు ఇంటి ముందు బైఠాయించి ఘర్షణకు దిగారు. ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. వైసీపీ నేతల ప్రవర్తన గూండాలను తలపిస్తోందని ఆయన విమర్శించారు.

వైసీపీ నేతలు కర్రలు, రాళ్లు చేతపట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిని ముట్టడించడం ఏంటని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. దీనివెనుక సీఎం ఉన్నారని, ఆయనే ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వికృత చేష్టలు శోచనీయం అని, పోలీసులు ఎందుకు నిలువరించలేకపోతున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిలదీశారు. సీఎం జగన్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement