Sunday, April 28, 2024

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

రైలు ప్రయాణికులకు ఇదో శుభవార్త అనే చెప్పాలి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరి కొన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది నుంచి రెగ్యులర్ రైళ్లకు బదులు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్, గౌతమి ఎక్స్ ప్రెస్, తదితర రైళ్లు స్పెషల్ ట్రైన్స్ గా అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి నిబంధనలుగా రైల్వే శాఖ పేర్కొంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement