Friday, July 26, 2024

Gowthami | బీజేపీకి గుడ్ బై… అన్నాడీఎంకే పార్టీలో చేరిన సినీ నటి గౌతమి !

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నటి గౌతమి ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. దాదాపు 25 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్న గౌతమి ఇప్పుడు అన్నాడీఎంకేలో చేరడం గమనార్హం.

గౌతమి గతంలో బీజేపీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేశానని… కష్టకాలంలో తనకు తగిన ఆదరణ లభించలేదని ఆమె గతంలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో… ఇవాళ పళనిస్వామి అన్నాడీఎంకే నివాసానికి వెళ్లి బీజేపీకి గుడ్ బై చెప్పి ఏఐఏడీఎంకేలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement