Monday, May 13, 2024

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం (65) గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ పార్టీ తరపున బూర్గంపాడు ఎమ్మెల్యేగా 1989, 1994 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రజాభిమానం పొందారు.‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు పదవీకాలం పూర్తయిన తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న కుంజా భిక్షం ఆ తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావ సమయంలో రెండేళ్ల పాటు పనిచేశారు. అనంతరం బీజేపీకి దగ్గరయ్యారు. ఆదివాసీ సమస్యల పట్ల పోరాడటంలో కుంజా భిక్షం తనదైన ముద్ర వేసుకున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో నెలరోజుల క్రితం చేరిన ఆయన శనివారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయినట్లు బంధువుల ద్వారా తెలిసింది. కుంజా భిక్షం మృతిపట్ల సీఎం కెసీఆర్ సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement