Friday, April 26, 2024

ప్రియుడి మోజులో ప‌డి… క‌ట్టుకున్న వాడిని క‌డ‌తేర్చింది..

అల‌హాబాద్: ప‌చ్చ‌ని సంసారం… వివాహేత‌ర సంబంధం చిచ్చురేపింది. ప్రియుడి మోజులోప‌డి క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేర్చింది ఓభార్యామ‌ణి. దాన్ని ఆత్మ‌హ‌త్య‌గా తీర్చిదిద్ది న‌మ్మించాల‌ని ప్ర‌య‌త్నిస్తూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ట్రం మెయిన్‌పురిలో చోటుచేసుకుంది. ప‌దేళ్ల క్రితం మ‌నోజ్ – ఖుష్బూల‌కు వివాహ‌మైంది. వీరికి ఏడేళ్ల కూతురు ఉంది. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ అన్యోన్యం జీవితం గ‌డుపుతున్నారు.

ఇలా సాగుతున్న ఆప‌చ్చ‌ని కాపురంలో అభిషేక్ మిశ్రా అనే యువ‌కుడు ప్ర‌వేశించ‌డం… అత‌నితో ఖుష్భూ వివాహేత‌ర సంబంధం పెట్టుకోవ‌డం… ఆ విష‌యం భ‌ర్త‌కు తెలియ‌డం. త‌రుచూ గొడ‌వ‌లు… ఇక ఎలాగైనా భ‌ర్త‌ను అడ్డుతొల‌గించుకోవాల‌ని ఆ భార్య ప్రియుడితో క‌లిసి ప‌న్నాగం ప‌న్నింది. రాత్రి నిద్రిస్తున్న స‌మ‌యంలో ప్రియుడితో క‌లిసి గొంతు నులిమి హ‌త్య చేశారు. ఆపై ఫ్యాన్‌కు ఉరేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీకించారు. ఇదంతా క‌న్న‌కూతురు చూసేసింది. ఎవ‌రికైనా చెబితే చంపేస్తానంటూ కూతురును బెదిరింది. ఈఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేశారు. విచార‌ణ‌లో భాగంగా కూతురును పోలీసులు కొన్ని ప్ర‌శ్న‌లు వేయ‌డంతో హ‌త్య చేసింది ఆమే న‌ని తేల్చారు. ప్రియుడి స‌హా ఇద్ద‌రినీ అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement