Wednesday, May 1, 2024

Jharkhand : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

నూత‌న సంవ‌త్స‌రం తొలిరోజే జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంషెడ్ పూర్‌ వద్ద ఇవాళ‌ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. వారంతా ఆదిత్యపూర్‌ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. జంషెడ్ పూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement