Thursday, May 2, 2024

Uttar Pradesh : ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు దుర్మరణం..

ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ ఉత్త‌ర ప్రదేశ్ లోని గ్రేట‌ర్ నోయిడాలో ఇవాళ‌ ఉద‌యం చోటుచేసుకుంది. య‌మునా ఎక్స్‌ప్రెస్‌వే వ‌ద్ద ఓ వ్యాన్ అదుపుత‌ప్పి గుర్తు తెలియ‌ని వాహ‌నాన్ని ఢీకొట్టింది.

ఈ ప్ర‌మాదంలో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక‌రు చిన్నారి ఉన్నారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ‌గా, వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement