Friday, May 17, 2024

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

మక్తల్, (ప్రభన్యూస్) : నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్నా రెండు కార్లు ఢీకొనడంతో స్పాట్లో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు.

ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని బొందలకుంట స్టేజి మలుపు వద్ద.. కర్ణాటక పాసింగ్ తో ఉన్న కారు, మహారాష్ట్ర పాసింగ్ తో ఉన్న మరో కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న‌ మక్తల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మ‌రిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement