Tuesday, May 14, 2024

Family Suicide : క‌డ‌ప జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ‌హ‌త్య

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్య‌క్తులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విసాద ఘ‌ట‌న‌ వైఎస్సార్ క‌డ‌ప‌ జిల్లాలో చోటుచేసుకుంది. తల్లి, కొడుకు, కూతురు చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తల్లి, కొడుకు, కూతురు మృతికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు పోలీసులకు వివరించారు. ఆత్మహత్యలకు కుటుంబ కలహాలేనా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడటంతో వల్లూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement