Saturday, May 11, 2024

బ్యాట్ పట్టిన మాజీ పీసీసీ చీఫ్

రెండు సార్లు మంత్రిగా చేశారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అతను మరెవరో కాదు రఘువీరారెడ్డి. ప్రస్తుతం రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ రైతుగా జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందరితో కలసి మెలసి ఊరిలో జరిగే ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా ఈ రోజు స్వగ్రామం అయిన అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠ పురంలో బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన రఘువీరారెడ్డి బ్యాట్ తో బంతిని కొట్టి టోర్నమెంట్ ను ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement