Thursday, May 2, 2024

National : పాకిస్థాన్‌లో భూకంపం….4.7 తీవ్రతతో భూకంపాలు

పాకిస్థాన్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీని లోతు 190 కిలోమీటర్లుగా నమోదైంది.

ప్రస్తుతం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పాకిస్తాన్‌లో తరచుగా వివిధ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే 2005లో పాకిస్థాన్‌లో అత్యంత ఘోరమైన భూకంపం సంభవించింది. ఇందులో 74 వేల మందికి పైగా చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement