Wednesday, May 1, 2024

Dogs Attack : బాస‌ర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల పై కుక్కల దాడి

బాసర : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నిన్న సాయంత్రం వేళా ప‌రీక్ష రాసి క్యాంపస్ హాస్టల్ కి వెళ్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం విద్యార్థులపై బయట నుండి వచ్చిన కుక్కలు దాడి చేశాయి. ఇట్టి విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా… ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు ట్రీట్మెంట్ తీసుకొని ఈరోజు ఎగ్జామ్స్ కూడా హాజరైనట్లు తెలిసింది. ఏదో ఒక చోట కుక్క దాడి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. రాష్ట్రంలో కుక్కల దాడి కేసుల సంఖ్య పెరుగుతుంది. ఆఖరికి బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులను వదలడం లేదంటూ నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement