Wednesday, May 8, 2024

DMK MP: లోక్ సభ సాక్షిగా సెంథిల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు….

బీజేపీని ఉద్దేశించి డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ కేవలం గోమూత్ర అని పిలువబడే హిందీ రాష్ట్రాల్లో మాత్రమే గెలువగలుగుతుందని ఆయన అన్నారు. జమ్ము కశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం దుమారం రేపుతోంది.

జమ్ముకశ్మీర్‌లో గెలువలేమని తెలిసే ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి గవర్నర్‌ ద్వారా అధికారం చెలాయిస్తోందని ఎంపీ సెంథిల్‌ కుమార్‌ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి గెలుపు దక్కే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement