Friday, May 17, 2024

ధర్మపురి లో మహా సుదర్శన యాగం – పాల్గొన్న మంత్రి కొప్పుల దంపతులు

ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మహా సుదర్శన యాగం కన్నులపండువగా నిర్వహించారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సుదర్శన యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ దంపతులు సుదర్శన యాగం లో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. సుదర్శన యాగంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement