Sunday, May 5, 2024

TS : మేడారంలో నీళ్లకోసం భక్తుల తండ్లాటా…

మేడారం బృందం: మేడారం ,రెడ్డిగూడెం,జంపన్న వాగు సమీపంలో వాటర్ రాక భక్తులు తీవ్ర అవస్త‌లు పడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 110 కోట్లతో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని చెబుతున్నప్పటికీ నీళ్ళ కోసం భక్తజనం తండోప తండాలుగా ఎదురుచూస్తున్నారు.

అధికార యంత్రాంగం భక్తులకు నీటి సౌకర్యం కోసం ప్రత్యేక బ్యాటరీ ట్యాప్స్,బోరింగ్ లను ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ ఎక్కడ కూడా పని చేయని పరిస్తితి నెలకొన్నది.కాంట్రాక్టర్ ల దగ్గర కమిషన్ ల కోసమే తూతూమంత్రంగా ఏర్పాటు చేశారని భక్తులు వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మేడారం భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement