Wednesday, May 1, 2024

Death Warning- 30కోట్లు ఇవ్వండి.. లేక‌పోతే చంపేస్తాం..ముఖేష్ అంబానీకి డెత్ మెయిల్..

30కోట్లు ఇవ్వండి.. లేక‌పోతే చంపేస్తామంటూ ముఖేష్ అంబానీకి డెత్ మెయిల్ అందింది. గుర్తు తెలియని వ్యక్తులు షూట్ చేసి చంపుతామంటూ ఈ మెయిల్ పంపించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధీనంలో నడుస్తోన్న ఆసుపత్రికి బెదిరింపు ఫోన్ కాల్ అందిన కొద్దిరోజుల్లోనే ముఖేష్ అంబానీకి డెత్ మెయిల్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండు ఘటనలు ముంబైలో కలకలం రేపాయి. పోలీసులు ఆయన నివాసానికి అదనపు భద్రతను కల్పించారు.


ఇదివరకూ ముఖేష్ అంబానీకి బెదిరింపులు అందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ అజ్ఞాత వ్యక్తుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆయనకు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. తాము అడిగిన 20 కోట్ల రూపాయలను ఇవ్వకపోతే షూట్ చేసి చంపుతామంటూ అజ్ఞాత వ్యక్తులు ముఖేష్ అంబానీకి ఇ-మెయిల్ పంపించారు.దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గమ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement