Friday, May 17, 2024

అదుపు త‌ప్పిన ‘కాన్వాయ్’..న‌లుగురికి గాయాలు..

ప్ర‌మాద‌వ‌శాత్తు కాన్వాయ్ అదుపుత‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘ‌ట‌న‌ గుత్తి హైవే నుంచి అనంతపురం వెళ్లే దారిలో కాసేపల్లె టోల్గేట్ ప్లాజా ముందు బృందావన్ హోటల్ దగ్గర చోటు చేసుకుంది. జెసి ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ లోని వెహికల్ అదుపుతప్పి రోడ్డు పక్కన సిమెంట్ దిమ్మకు ఢీ కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నారా లోకేష్ అనంతపూర్ పర్యటనకు వస్తున్నందున తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ,నారా లోకేష్ ఈ కార్యక్రమానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement