Monday, April 29, 2024

CM Stalin: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పర్యటించారు. వరద సాయం కింద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. తుఫాన్‌ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది.

భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. తుఫాన్‌ ప్రభావంతో గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు బుధవారానికి తగ్గినప్పటికీ, నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement