Friday, May 3, 2024

ఈనెల 24న సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈనెల 24వ తేదీన సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాయాలన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజున జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. వీటితో పాటు, నూతనంగా నిర్మించబడిన మెడికల్ కాలేజీ భవనాన్ని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేటలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement