Friday, May 3, 2024

NZB: సీఎం కేసీఆర్ ప్రకృతి ప్రేమికుడు.. మంత్రి వేముల

సీఎం కేసీఆర్ ప్రకృతి ప్రేమికుడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో భాగంగా నేడు చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి రైతు వేదిక వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హరితహారం అనే భృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో తెలంగాణలో అటవీ శాతం, గ్రీనరీ శాతం ఘనంగా పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని కొనియాడారు. పచ్చదనం పెంపులో నేడు తెలంగాణ నెంబర్ వన్ అయ్యిందన్నారు. సమాజ హితం కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం హరితహారమని, ఓట్ల కోసమో, సీట్ల కోసమో కానేకాదని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు మనం అందించే సంపద పచ్చదనమే అని అన్నారు. కేసీఆర్ ప్రకృతి ప్రేమికుడని అందుకే రాజకీయాలకు సంబంధం లేకుండా హరితహరం చేపట్టి గ్రీనరి పెంపుకు శ్రీకారం చుట్టారని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement