Friday, May 3, 2024

అజిత్ సింగ్ తో అనుబంధాన్ని స్మరించుకున్న చిరంజీవి

కేంద్ర మాజీ మంత్రి, ఆర్ఎల్డీ పార్టీ అధినేత అజిత్ సింగ్ మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గతంలో తనతో పాటు అజిత్ సింగ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో  సేవలు అందించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అజిత్ సింగ్ రైతు పక్షపాతి అని తెలిపారు. విమానయాన మంత్రిగా, ఆర్ఎల్డీ పార్టీ అధినేతగా సమూల సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement