Sunday, May 19, 2024

Breaking : ప్ర‌భుత్వ ఉద్యోగుల ఇళ్ళ‌పై విజిలెన్స్ దాడులు-నాలుగు కోట్ల న‌గ‌దు స్వాధీనం

ప్ర‌భుత్వ అధికారుల ఇళ్ల‌పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వ‌హించారు.ఈ దాడుల్లో వారి ఇళ్ల నుంచి పెద్ద‌మొత్తంలో న‌గ‌దును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల దాడుల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉంది.ముగ్గురు బిహార్ ప్ర‌భుత్వ ఉద్యోగుల ఇండ్ల‌లో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ చేప‌ట్టిన దాడుల్లో ఏకంగా రూ 4 కోట్ల న‌గ‌దు ల‌భ్య‌మైంది. ప్ర‌జా ప‌నుల శాఖ కిష‌న్‌గంజ్ డివిజ‌న్ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ సంజ‌య్ కుమార్ రాయ్‌కు చెందిన ప‌ట్నా, కిష‌న్‌గంజ్‌లో ప‌లు ప్ర‌దేశాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వ‌హించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement