Wednesday, May 1, 2024

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని కొనుగోలు చేసిన బాలీవుడ్ నటి..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి మూడేళ్లు పూర్తయ్యాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, ప్రతి ఒక్కరూ పెద్ద షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అనేక షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంది.. జైలులో కూడా గడిపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత, బాలీవుడ్ ప్రముఖ డైరెక్ట‌ర్ కరణ్ జోహార్ ని కూడాటార్గెట్ చేశారు సుశాంత్ అభిమానులు.

ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తుదిస్వాస విడిచిన ఇంట్లొ ఉండేందుకు ఎవరూ రాలేదు. తాజాగా, దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో నివసించడానికి ఒకరు వస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన ఇంటిని ఇప్పుడు ఒక నటి కొనుగోలు చేసింది. ది కేరళ స్టోరీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నటి అదా శర్మ ఈ ఇంటిని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆమె సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటికి త్వ‌ర‌లోనే మారనుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement