Saturday, May 11, 2024

BJP – బిఆర్ఎస్ కు చెక్ పెట్టేది మేమే…రాజ‌గోపాల్ రాజీనామా వ్య‌క్తిగ‌తం …కిష‌న్ రెడ్డి

తెలంగాణాలో బిఆర్ ఎస్ పాల‌న‌కు తెర‌దించేది తామేన‌ని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి.. ఢిల్లీకి వెళుతున్న ఆయ‌న ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై స్పందిస్తూ, రాజగోపాల్ రెడ్డికి పార్టీ మంచి అవకాశం ఇచ్చిందని, జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టామని చెప్పారు. అయినా పార్టీ మారడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని వివరించారు. అయితే, వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం కాబోదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీకి రాజీనామా చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీ పోటీలో లేదని వారు అనుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement