మేధక్, ప్రభన్యస్: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు రక్షణ కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు జన్మించిన సంఘటన ఈ రోజు (శుక్రవారం) చోటు చేసుకుంది. చౌటకూర్ గ్రామ పరిధిలోని వెంకట కిష్టాపూర్కు చెందిన వనజ (22)కు ఈ రోజు పురిటి నొప్పులు రావడంతో సంగారెడ్డి మాతా శిశు రక్షణ కేంద్రంలో చేర్పించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మొదటి కాన్పు అయిన వనజ.. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.
కాగా ఇద్దరు మగ పిల్లలు 1.5 కిలోలు, ఆడ శిశువు 1.2 కిలోలు ఉన్నదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనీల్ తెలిపారు. ఆపరేషన్ చేసి కాన్పు చేశామని, ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.