Saturday, April 20, 2024

శంషాబాద్‌లో బీహారీ గ్యాంగ్ కలకలం.. బైకులు ధ్వంసం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో బీహార్‌కు చెందిన వ్యక్తులు కలకలం సృష్టించారు. శంషాబాద్ మండలం రషీద్ గుడా గ్రామానికి చెందిన శివమణి తన బైకుపై గొల్లపల్లి వెళ్ళి తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గొల్లపల్లి గ్రామ శివారులో దాదాపు ఏడుగురు గుర్తుతెలియని దుండగులు తమ బైకులను అడ్డగించి కర్రలతో దాడికి పాల్పడినట్లు శివమణి తెలిపాడు. దుండగుల దెబ్బలకు తట్టుకోలేక అక్కడ బైకులను వదిలేసి రషీద్‌గూడ గ్రామానికి వెళ్ళి విషయం కుటుంబ సభ్యులతో చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు భయంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు చేరుకున్న కుటుంబ సభ్యులు. కర్రలను పోలీసులకు చూయించారు. పోలీసులు నింధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడ నిందితులు పక్కనే కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న బీహారీలు అని పోలీసులకు చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లినా పోలీసులకు నిందితులు కనిపించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement