Friday, May 3, 2024

Bhopal – బైక్ ను ఢీ కొన్న కేంద్ర మంత్రి వాహనం – ఒకరు స్పాట్ డెడ్ , మంత్రికీ గాయాలు

మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న వాహనం మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రహ్లాద్ పటేల్ చింద్వారా నుంచి నర్సింగ్ పూర్ వెళ్తుండగా ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ‘వివేక్’ బంటి షాహుకు మద్దతుగా ప్రచారం చేయడానికి పటేల్ చింద్వారాకు వచ్చారు.

రోడ్ షోలలో పాల్గొన్న తరువాత బీజేపీ అభ్యర్థి బంటి సాహు కోసం ర్యాలీలలో ప్రసంగించిన తరువాత, కేంద్ర మంత్రి తన సొంత జిల్లా నర్సింగ్ పూర్ కు బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు పిల్లలు దూరంగా పడిపోయారు. ఈ ప్ర‌మాదంలో ధ్వంసమైన మంత్రి వాహనం కూడా రోడ్డుపై నుంచి పొలాల్లోకి దూసుకెళ్లింది. మంత్రి కాళ్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement