Sunday, April 28, 2024

Bharat Jodo Yatra: ఇవాళ్టి నుంచి బీహార్‌ భారత్ జోడో యాత్ర

ఇవాళ్టి నుంచి బీహార్‌ రాష్ట్రంలోని ఔరంగాబాద్ నుంచి రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారంవాయిదా పడింది. కాగా, సోనియాగాంధీ రాజ్యసభకు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా యాత్రను ఒక్కరోజు నిలిపివేశారు.

అయితే, ఇవాళ్టి నుంచి బీహార్‌ రాష్ట్రంలోని ఔరంగాబాద్ నుంచి రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని హస్తం పార్టీ ప్రకటించింది. ఔరంగాబాద్‌లో నేటి మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement