Thursday, April 18, 2024

Telangana: ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి.. డీజీపీ నుంచి నివేదిక కోరిన గవర్నర్

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి, ధ్వంసం చేసిన ఘటనపై సవివరమైన నివేదిక అందజేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం పోలీసు డైరెక్టర్ జనరల్‌ను కోరారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంపై దాడి చేసి, ధ్వంసం చేయడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని తమిళిసై పేర్కొన్నారు. ఎంపీ నివాసంలో కుటుంబ సభ్యులను, ఇంటి పనిమనిషిని బెదిరించడం, భయపెట్టడం స‌బ‌బు కాద‌ని, ప్రాధాన్యతా ప్రాతిపదికన డీజీపీ నుంచి నివేదిక కోరామని ఆమె అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement