Thursday, April 25, 2024

ఫొటో షూట్​ లో దారుణం.. మోడ‌ల్‌పై గ్యాంగ్ రేప్‌..

ప్ర‌భ‌న్యూస్ : ఫొటోషూట్ కోసం వ‌చ్చిన ఓ మోడ‌ల్‌పై ప‌రిచ‌య‌స్తుడే త‌న స్నేహితుల‌తో క‌లిసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రం కొచ్చిలోని క‌క్క‌నాడలో చోటుచేసుకుంది. మ‌ల‌ప్పురం జిల్లాకు చెందిన మోడ‌ల్ ఫొటో షూట్ కోసం కొచ్చిన్‌కు వ‌చ్చింది. అక్క‌డ ఓ లాడ్డిలో గ‌ది తీసుకుని, అక్క‌డే బ‌స చేసింది. ఆ స‌మ‌యంలో అల‌ప్పుజాకు చెందిన స‌లీం కుమార్‌తో ప‌రిచ‌య‌డం ఏర్ప‌డింది. ఇద్ద‌రూ లాడ్జిలో గ‌డిపారు. ఆ స‌మ‌యంలో కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి మోడ‌ల్‌కు అందించాడు. విష‌యం తెలియ‌ని ఆమే క్రూల్ డ్రింక్‌ను తాగి, మ‌త్తులోకి జారుకుంది.

ఇదే అదునుగా భావించి స‌లీంకుమార్‌తో పాటు లాడ్జి య‌జ‌మాని, మ‌రొక‌రితో క‌లిసి మోడ‌ల్‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ను ఫోన్‌తో వీడియో తీశారు. ఆ వీడియోను చూపించి మోడ‌ల్‌పై మూడ్రోజుల పాటు చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. వారి బారినుంచి త‌ప్పించుకుని పోలీసుస్టేష‌న్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. నిందితుడు స‌లీంకుమార్ అరెస్టు చేశారు, మ‌రో ఇద్ద‌రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement