Wednesday, May 1, 2024

అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్ లో.. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్

వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ని అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్ కి మార్చారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. బాలకృష్ణ హీరోగా .. ఆయన జోడీగా శ్రుతి హాసన్ నటించిన సినిమా ఇది. మొదటిసారిగా ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే స్థల మార్పు విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఒంగోలులోని ఈ ప్రదేశంలో ఈ నెల 6వ తేదీ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. .. ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement