Tuesday, April 23, 2024

అస‌భ్య‌క‌ర‌మైన రాత‌లు రాస్తున్న యువ‌కుడు.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన అన‌సూయ‌

సోష‌ల్ మీడియాలో హీరోయిన్స్ ఫొటోలు పెట్టి అస‌భ్య‌క‌ర‌మైన రాత‌లు రాస్తున్న నిందితుడిని ప‌ట్టుకుని కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు పోలీసులు. టాలీవుడ్ యాంకర్ అనసూయ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు అయింది. 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 నిందితుడు పందిరి రామ వెంకట వీర్రాజును అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు సైబరాబాద్ పోలీసులు.

ఈ నెల 17న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది యాంకర్ అనసూయ.సాయి రవి 267 ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆపరేట్ చేస్తూ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టాడు నిందితుడు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు. గతంలో మూడేళ్లపాటు దుబాయిలో ప్లంబర్ వర్క్ చేసిన నిందితుడు.. ఫిలిం ఇండస్ట్రీ యాంకర్స్ హీరోయిన్స్ టార్గెట్ చేసి పోస్టు పెడుతున్నాడు. యాక్ట్రెస్ రోజా, అనసూయ, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలతో పోస్టులు పెట్టాడు. అయితే.. అనసూయ ఫిర్యాదుతో నిందితున్ని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement