Wednesday, May 1, 2024

అల్లూరిసీతారామరాజు విగ్ర‌హానికి నివాళిల‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ప్రారంభ‌మైన జ‌న‌వాణిలో పాలుపంచుకునే నిమిత్తం ఆదివారం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ‌వ‌రం వెళ్లారు. ఈ క్ర‌మంలో ప‌ట్ట‌ణంలో ఇటీవ‌ల ఏర్పాటు చేసిన అల్లూరిసీతారామ‌రాజు విగ్ర‌హం వ‌ద్ద‌కు వెళ్లిన ప‌వ‌న్‌… మ‌న్యం వీరుడికి నివాళి అర్పించారు.ఈ నెల 4న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు కార‌ణాల వ‌ల్ల హాజ‌రు కాలేదు. తాజాగా త‌న భీమ‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న అల్లూరి విగ్ర‌హానికి నివాళి అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement