Friday, May 3, 2024

అక్టోబర్ నుంచి అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలివే.!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో జిల్లాలో అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిచ‌నున్నారు. వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో అక్టోబర్ 15 నుంచి 31 వరకు భారత సైన్యం ఈ ర్యాలీని నిర్వహిచ‌నుంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ‘అగ్నివీర్’ అభ్యర్థులను ఆర్మీలోకి చేర్చుకుంటారు. అభ్యర్థులు ఆగస్టు 5 నుండి సెప్టెంబర్ 3 వరకు www.joinindianarmy.nic.in లో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 అక్టోబర్ 1 నాటికి.. 23 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని సంభందిత అధికారులు పేర్కొన్నారు.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్, ఫెయిర్, పారదర్శకంగా ఉంటుంది. అభ్యర్థులు ఎవరైనా ఉత్తీర్ణత సాధించడానికి లేదా నమోదు చేసుకోవడానికి సహాయం చేస్తామ‌ని క్లెయిమ్ చేసే టౌట్‌లు/మోసగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండాలి, హార్డ్ వర్క్, ప్రిపరేషన్ మాత్రమే మెరిట్ ప్రకారం వారి ఎంపికను నిర్ధారిస్తుంది సంభందిత అధికారులు తెలియ‌జేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement