Friday, April 26, 2024

Adilabad | డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన మందుబాబులు.. కోర్టు శిక్ష ఏంటో తెలిస్తే షాక్ కావాల్సిందే!

మంచిర్యాల టౌన్, (ప్రభన్యూస్) : మంచిర్యాల పట్టణంలో డ్రంకెన్‌ డ్రైవ్ లో పట్టుబడిన 14 మందికి కోర్టు శిక్ష విధించింది. వీరంతా రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శుభ్రం చేయాల‌ని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ డి.ఉపనిషాద్విని శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు. ట్రాఫిక్ సీఐ కె.నరేష్ కుమార్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పట్టుబడిన వారిని న్యాయమూర్తి ముందు ఇవ్వాల (శ‌నివారం) ప్రవేశ పెట్టారు. ఈ క్ర‌మంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండు రోజుల పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శుభ్రం చేయాలని శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.

శిక్ష పడిన వారిలో సుంకరి నంబయ్య (మందమర్రి), చెందులూరి సత్యనారాయణ (మంచిర్యాల), బోగంట దుర్గయ్య (రాళ్ల‌పేట గ్రామం), చీకట్ల మణికంఠ (మంథని), కుర్సెంగ రాము (తలమల గ్రామం), నికోడ్ మహేశ్‌ (భీమిని), కొండపర్తి సతీష్ (జైపూర్), చింతపూడి మారయ్య (గుడిపేట), రాంటెంకి లక్ష్మణ్ (చాకేపల్లి), కోమాకుల రామరాజు (మందమర్రి), చెరుకు సత్యనారాయణ రెడ్డి (జైపూర్), అక్కల రవితేజ (మంచిర్యాల), పున్నం (సుద్దాల గ్రామం), గజె గట్టయ్య (మంచిర్యాల) ఉన్నారని ట్రాఫిక్ సీఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement