Tuesday, May 7, 2024

Delhi | కిషన్‌రెడ్డికి లండన్‌లో ఘనస్వాగతం.. మోదీ పాలనలో సాధించిన ప్రగతిని వివరించిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విదేశాల్లో ఉంటున్న భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడం, వారికి సరైన గౌరవం దక్కేలా చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. న్యూయార్క్ పర్యటన ముగించుకుని లండన్ చేరుకున్న హీత్రూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు సోమవారం ఘన స్వాగతం లభించింది. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే విభాగం ఆధ్వర్యంలో విమానాశ్రయంలో సంప్రదాయ పద్ధతిలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఢోల్ వాద్యాలు, వేద మంత్రోచ్ఛారణ, ఆరతులతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని దీప ప్రజ్వలన చేసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన కార్యక్రమాలు, భారతీయ సమాజంలో వచ్చిన మార్పులను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు యువతీ యువకులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పారు. అనంతరం ‘సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్స్‌లెన్స్’ విద్యార్థులైన యువత చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే విభాగం అధ్యక్షుడు కుల్‌దీప్ షెకావత్, ప్రధానకార్యదర్శి సురేశ్ మంగళగిరి, సభ్యులు, భారత సంతతికి చెందిన పలువురు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement