Sunday, April 28, 2024

Chennai: 700 కోట్ల విలువైన బంగారం ప‌ట్టివేత

ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌ పరిధిలో కుండ్రత్తూర్‌ రహదారిలో ఫ్లయింగ్‌ స్క్వాడ్ చేప‌ట్టిన వాహనాల తనిఖీ ల‌లో అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన లారీలో 1,025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీశారు.

బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్‌ సమీప మన్నూర్‌లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు…. 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయని మిగిలినదానికి లేవ‌ని తేల్చారు. ఈ విష‌యంలో అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులను సంప్రదించారు. వీటి మొత్తం విలువ రూ.700 కోట్లు ఉంటుందని అంచనా.

- Advertisement -

ఇదిలా ఉంటే.. ఎలక్షన్‌ ప్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ఓ పంచాయితీ ప్రెసిడెంట్‌ ఇంటి నుంచి కోటి రూపాయాల్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎట్టారై గ్రామం పంచాయితీ ప్రెసిడెంట్‌ దివ్య అన్బరసన్‌ నుంచి ఈ సొమ్మును రికవరీ చేశారు. ఆమె అన్నాడీఎంకేకు చెందిన నేత.

Advertisement

తాజా వార్తలు

Advertisement