Tuesday, April 30, 2024

Railway jobs: 4600 రైల్వే జాబ్స్.. దరఖాస్తుల స్వీకరణ

మే 14 వరకు దరఖాస్తుకు గడువు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్​లో వివిధ ఖాళీల భర్తీ
పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ పోస్టులు
నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే శాఖ


రైల్వేలో భారీ నియామక ప్రక్రియ మొదలైంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) లో కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది. ఆర్పీఎఫ్​లో మొత్తం ఖాళీలు 4,660 కాగా, వీటిలో కానిస్టేబుల్ పోస్టులు 4,208, ఎస్సై పోస్టులు 452 ఉన్నాయి. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి రైల్వే శాఖ 14 వేల జాబ్ నోటిఫికేషన్స్ ప్రకటించగా.. తాజాగా ఆర్పీఎఫ్ లో ఖాళీల భర్తీకి ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సోమవారం (ఏప్రిల్ 14న) ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ మే 14వ తేదీతో ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement