Wednesday, May 15, 2024

బంగారు గనిలో అగ్ని ప్రమాదం – 27 మంది దుర్మరణం

దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 27 మంది కార్మికులు మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు

ఇది దేశ ఇటీవలి చరిత్రలో అత్యంత ఘోరమైన మైనింగ్ విషాదాలలో ఒకటిగా నిలిచింది. దుఃఖంలో మునిగిన బంధువులు తమ ప్రియమైనవారి వార్తల కోసం గని దగ్గర గుమిగూడారు. పెరూకు దక్షిణంగా ఉన్న అరేక్విపా డిపార్ట్‌మెంట్‌లో ఉన్న యానాక్విహువా గనిలో ఈ సంఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అరేక్విపా స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గోల్డ్ మైనింగ్ సైట్‌కు దగ్గరగా ఉన్న చెక్క బ్లాకుల ద్వారా మంటలు త్వరగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 27 మంది కార్మికులు ఊపిరాడక మరణించారు. ఆ మరణాల్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement