Friday, April 26, 2024

తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మరణాలు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,493 కరోనా కేసులు, 15 మరణాలు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,80,844కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 318 కరోనా కేసులు వచ్చాయి. ఇక రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,308 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 33,254 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో 94,189 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement