Saturday, May 25, 2024

ఆండాళ్‌ ఆవిర్భవించిన వేళ…

నేడు ఆండాళ్‌ తిరు
నక్షత్రం

శ్రీ వైష్ణవులు అత్యంత ఎక్కువగా కొలిచే దేవతల్లో ఆండాళ్‌ ఒకరు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్‌లో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్క డి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంత రం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎం చి, ఆయనకు పెరియాళ్వారు అంటే- పెద్ద ఆళ్వారు అన్న గౌర వాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపిం చింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే- పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు. ఆ పేరే క్ర మంగా గోదాగా మారింది.
గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్తవయ సు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా, తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నే#హతురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడనే పడింది. తన కూ తురు చేసిన పనివల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగు తుందనీ తెలియచేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింత గా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగా లని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కా త్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ, అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్స#హంచింది. తన స్నే#హతురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణభక్తి ని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మా సంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై! ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు, ఆ కృష్ణుడు లొంగక తప్ప లేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ, అక్కడ రంగనాథుని గా వెలసిన తాను గోదాదేవిని వివా#హం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విష యాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుం డా పోయాయి. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుం డగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది.
ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాల యంలో భోగినాడు గోదాదేవికి, విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. అటువంటి గోదాదే వి తిరునక్షత్రం ఈ రోజు అంటే ఆవిడ విష్ణుచిత్తుల వారికి ఆడి మాసంలో ఉత్తర ఫల్గుణి నక్ష త్రం రోజు తులసి వనంలో దొరికింది. అందుకే ఈ రోజు అన్ని వైష్ణవాలయాలలో ప్రధానం గా తిరుమల తిరుపతి, శ్రీరంగం, మధురైలో మీనాక్షి, పరాశక్తి దేవాలయాల్లో ఆండాళ్‌ తిరు నక్షత్రం అత్యంత వైభవంగా జరుపుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement